ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. ప్రభుత్వం 30పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలిపే స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు.