సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా… తూర్పు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు 88 స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలతో పాటు సర్వీసుల సంఖ్య వివరాలను వెల్లడించింది.