UP wife planned to kill her husband and make him believe he died of a snake bite | UP Crime News:భర్తను చంపేసి పక్కన పామును పెట్టిన భార్య

UP wife: వివాహేతర బంధాల కారణంగా జీవిత భాగస్వామిని అత్యంత  దారుణంగా చంపి బయటపడేందుకు కొత్త కొత్త ప్లాన్లు వేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల ఓ నేవీ ఉద్యోగిని చంపేసి బ్లూ డ్రమ్ములో సిమెంట్ తో మిక్సింగ్ చేసిన భార్య ఉదంతం మరువక ముందే.. యూపీలో మరో భార్య భర్తను చంపేసింది. ఈ సారి ఈ భార్య పాత తెలుగు సినిమాల్లో కుట్రల ప్లాన్ ను ఎంచుకోవడంతో దొరికిపోయింది. కానీ భర్త ప్రాణం మాత్రం  మిగల్లేదు. 

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమిత్ కశ్యప్  అనే వ్యక్తికి కొద్ది రోజుల కిందట రవితతో పెళ్లి అయింది. చిరుద్యోగం చేసుకునే అతడు  భార్య రవితతో కలిసి మీరట్ లోనే కాపురం పెట్టాడు. అమిత్ కశ్యప్ స్నేహితులు తరచూ ఇంటికి వచ్చేవారు. ఇలాంటికి వచ్చినప్పుడు అమిత్ స్నేహితుడు అమర్ దీప్‌కు.. రవితతో పరిచయం ఏర్పడింది. అమర్ దీప్ తో మాటలు పెరిగి చివరికి అది వివాహేతరబంధానికి దారి తీసుకుంది. భర్తతో కన్నా..భర్త స్నేహితుడు అమర్ దీప్ తోనే రవిత ఎక్కువ సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. దీంతో భర్త అమిత్ కు అనుమానం వచ్చింది.  ఓ సారి వీరిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండటంతో చూసి తట్టుకోలేకపోయాడు. 

తన భార్య..తన మిత్రుడు కలిసి తనను ఇంత మోసం చేస్తారా అని వారిద్దరితో గొడవ పడ్డాడు. అయితే అప్పటికప్పుడు  ఎలాగో సర్దుబాటు చేసుకున్నా.. అమిత్  ను అడ్డుతొలగించుకోకపోతే తమ  మధ్య వివాహేతర బంధం కొనసాగించడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. వెంటనే  ఓ ప్లాన్  వేశారు. ఓ రోజు  అమిత్ కు మద్యం తాగించి  నిద్ర పోయిన తర్వాత గొంతు పిసికి చంపాలనుకున్నారు. అనారోగ్యంతో చనిపోయాడంటే నమ్మరు కాబట్టి పాము కరిచి చనిపోయాడని నమ్మించాలని  డిసైడయ్యారు. అందుకు అమర్ దీప్ ఓ పామును వెయ్యి పెట్టి కొనుక్కొచ్చాడు. అనుకున్నట్లుగానే  రెండు రోజుల కిందట అమిత్ కు మద్యం తాగించి పడుకున్న తర్వాత భార్య రవిత గొంతు  పిసికి చంపేసింది. తర్వాత  ప్రియుడును పిలిచి అతను తీసుకు వచ్చిన పామును శవం పక్కన పడేశారు.                      

ఉదయమే  చుట్టుపక్కల వారందర్నీ పిలిచి తన భర్త పాముకతాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కొంత  మంది  అనుమానపడ్డారు. పాముకాటుతో చనిపోయాడు కాబట్టి  పోస్టుమార్టం చేయాలని కొంత మంది పట్టుబట్టారు. కొంత మందికి పోలీసులకు  సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వచ్చి  అమిత్ శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.  పోస్ట్ మార్టంలో గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లను డాక్టర్లు గుర్తించారు.  పోలీసులు అమర్ దీప్‌ను, రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. మరీ ఓల్డ్ మోడల్ ప్లాన్ చేయడంతో వెంటనే దొరికిపోయారని పోలీసులు సెటైర్లు వేసుకుంటున్నారు. 

వివాహేతర బంధాలతో ఇలా హత్యలు చేసి.. కొన్ని జీవితాల్ని చిదిమేయడంతో పాటు తమ జీవితాల్ని జైలు పాలు చేసుకుంటున్నారు. 

 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link