Will GST be levied on UPI payments made above Rs 2000

GST on UPI Payments:యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ ఇదే యూపీఐ సంక్షిప్త రూపం. సగటు భారతీయుడి చెల్లింపులను ఈజీ చేసిన ఈ యూపీఏపై జీఎస్‌టీ వేస్తారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి చాలా మంది చెల్లింపులు చేయడానికి కూడా భయపడిపోతున్నారు. కానీ ఈ ప్రచారానికి కేంద్రం పుల్‌స్టాప్ పెట్టింది. కీలకమైన ప్రకటన జారీ చేసింది. 

భారత దేశ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది యూపీఐ. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసి కోట్ల మందికి చేరువైపోయింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుల కారణంగా చాలా మంది ఫిజికల్‌గా క్యాష్ తీసుకెళ్లడం మానేశారు. జేబులో రూపాయి చిల్లర లేకపోయినా మొబైల్ ఉంటే దేశం మొత్తం తిరిగి రావచ్చు.

ఇంతలా భారత ఆర్థిక రంగం రూపురేఖలు మార్చేసిన యూపీఐపై జీఎస్టీ వేస్తారని చాలా కాలం నుంచి వినిపిస్తన్న మాట. ఎందుకంటే… ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయమే. కార్డు పేమెంట్స్ చేసేటప్పుడు జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు మెర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ పేరుతో నగదు తీసుకుంటున్నాయి. అందుకే తర్వాత యూపీఐ పేమెంట్స్‌పై ఆర్బీఐ పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. 2000లకు మించిన చెల్లింపులు చేస్తే 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని కథనాలు కూడా వచ్చాయి. 

ఈ ఊహాగానాలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేేక్ అని తేల్చి చెప్పింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. 

దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link