పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం రాకూడదని హైకోర్టులో 18కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేశారని వివరించారు. మూడేళ్లుగా కోర్టుల్లో వేసిన కేసులు పరిష్కరించేందుకు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. చివరకు దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులతో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం గెలిచి ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోవడంతో, ఆ తర్వాత ఇళ్లు నిర్మించకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, కేంద్రంలో ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కేంద్ర మంత్రలు, సెక్రటరీలను కలిశారని, చివరకు హైకోర్టులో కేసులు వేశారని, వాటిని పరిష్కరించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.