“2014, 2019 మధ్య సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నగరంలో, చుట్టుపక్కల భారీ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని ఆశించి, అనేక మంది రియల్టర్లు, బిల్డర్లు విజయవాడ, గుంటూరులలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును నిలిపివేయడంతో వారికి ఎదురుదెబ్బ తగిలింది” అని ఏపీ చాప్టర్ బిల్డర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అభిప్రాయపడింది.