తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో టీటీడీ పాలక మండలి పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసిన నేపథ్యంలోనే.. తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమార ధార, పసుపు ధార జలాశయాలకు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చింది.