మంత్రులతో సమావేశాలు..
చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యంగా జలవనరుల శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, వైద్య శాఖలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.