రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రతి సంవత్సరం 3,033 ఆలయాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బోనాల పండుగకు ముందు తొలకరి పలకరింపు శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు. ఆషాడబోనాల సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకోడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.