ఇకనైనా కాపాడుకోవాలి..
‘ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేసే అవకాశాలు తక్కువ. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ జగన్కు మంచి ఆయుధం. బడ్జెట్పై మీడియాలో మాట్లాడటం కంటే.. అసెంబ్లీలో మాట్లాడటమే మంచిది. సభ లోపల అవకాశం లేకపోతే.. మీడియా పాయింట్ దగ్గర అయినా మాట్లాడొచ్చు. కానీ ఆయన ఆ పని చేయలేదు. సంక్రాంతి నుంచే ప్రజ్లలోకి వస్తానన్నారు. ఇప్పటికీ రాలేదు. అటు మున్సిపాలిటీల్లో టీడీపీ ఆధిపత్యం పెరుగుతోంది. మా పార్టీ కేడర్లో నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం జగన్పై అభిమానం ఉన్నవారే పార్టీలో ఉన్నారు. ఇకనైనా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్పై ఉంది’ అని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చెప్పారు.