గౌరవెల్లి ప్రాజెక్ట్ తో పాటు ఎస్ఆర్ఎస్పీ – ఐఎఫ్ఎఫ్సి లోని ప్యాకేజీ నంబర్ -7 లోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి రూ 437 కోట్ల రూపాయలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనా ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే లక్షా ఆరు వేల (1,06,000 )ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉన్న రెండు ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు , ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.