ఎర్రబంగారం ఏడిపిస్తోంది.. ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుంది.. షర్మిల ఎమోషనల్ పోస్ట్-ys sharmila emotional post about andhra pradesh chilli farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

జగన్ ప్రశ్నలు..

ఇటీవల జగన్ కూడా మిర్చి రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మిర్చి రైతుల కడగండ్లపై ఈ జనవరిలో ఉద్యాన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా కనీసం పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? తప్పుడు రాజకీయాలు చేస్తూ.. మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటారా? మీ చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేయకుండా.. ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్‌ ద్వారా కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా?’ అని జగన్ ప్రశ్నించారు.

Source link