ఆ సూచనల ప్రకారమే అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1 లో చేర్చి వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించామని, వారికి జనాభా ప్రకారం 0.5 % శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా, 1 శాతం ఇచ్చారన్నారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అందరికీ సమాన అవకాశాలు అందాలనేది తమ ఉద్దేశంమన్నారు. ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న వర్గీకరణ.. సోషల్ జస్టిస్ కోసం జరుగుతున్న వర్గీకరణ అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.