ఏపీలో మళ్లీ ఇసుక కొరత.. ధరలకు రెక్కలు, నిర్మాణ రంగం విలవిల, ఉపాధి లేక కూలీలకు కష్టాలు-sand shortage again in ap construction laborers suffering with sand scarcity ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇప్పుడు కోర్టు కేసులు, ఎన్జీటి ఉత్తర్వుల పేరుతో రీచ్‌లను పూర్తిగా నిలిపివేయడంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. జూన్‌లో వర్షాలు ప్రారంభమై నదుల్లోకి నీటి ప్రవాహం ప్రారంభమైతే ఇసుక తరలింపుకు కష్టాలు తప్పవు. దీంతో అప్పుడు కూడా నిర్మాణ రంగంపైనే ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాల్లో ఎక్కడా ఇసుక కొరత లేదని, అనుమతించిన రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యమైన అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండటంతో మైనింగ్ శాఖ అధికారులు ఆడింది ఆటగా మారింది.

Source link