19 ఏకలవ్య కాలేజీల్లో
2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని 19 ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో(Ekalavya Junior Colleges) ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ కోర్సు్ల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2024లో పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు పూర్తి వివరాలను https://twreiscet.apcfss.in/ చూడవచ్చు. విద్యార్థులు ఇతర సందేహాల కోసం ఆయా జిల్లాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) కన్వినర్, ప్రిన్సిపాల్స్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా, ఈఎమ్ఆర్ఎస్ నిబంధనల మేరకు అడ్మిషన్ల భర్తీ చేపట్టాలని కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.