AP PGCET 2025 : ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(APPGCET-2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యామండలి పీజీసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీసెట్ ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఎంఏ /ఎంకాం/ ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఏపీ పీజీఈసెట్ అప్లికేషన్లు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి 13 వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.