అంతా తమ వల్లేనని ప్రచారం….
ఈ రకమైన పరిస్థితి వైసీపీలో కూడా ఉంది. వైసీపీ తరపున పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే మీడియా విభాగం, ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచార శాఖ, సోషల్ మీడియా ప్రచారానికి డిజిటల్ కార్పొరేషన్ వంటివి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి ప్రమేయం లేకుండా జరిగే ప్రచారాన్ని కూడా కన్సల్టెంట్లు తమ ఖాతాల్లో వేసుకుని క్రెడిట్ కొట్టేస్తుండటం పార్టీల పెద్దలు గమనించడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పత్రికల్లో టీవీల్లో వచ్చే రోజు వారీ కథనాలు, అయా పార్టీలకు అనుకూలంగా వచ్చే వార్తలు కూడా తమ చాతుర్యం వల్లేనని చెప్పుకోవడం వీటికి అలవాటై పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాలపై కోట్లు ఖర్చు చేస్తోన్న అయా పార్టీల పెద్దలుమేల్కొంటారో లేదో కాలమే నిర్ణయించాలి.