తల్లిదండ్రులు లేక రౌడీగా మారిన ప్రశాంత్
పచ్చునూరుకు చెందిన గోపు రమ, రఘునాథరెడ్డికి ఇద్దరు కొడుకులు, పెద్దకొడుకు శ్యాంసుందర్ వరంగల్ లో ఉంటున్నాడు. చిన్నకొడుకు ప్రశాంత్ రెడ్డి (23) ఇంటర్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పదేళ్ల క్రితం తల్లి రమ, ఆరేళ్ల క్రితం తండ్రి రఘునాథరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రశాంత్ రెడ్డి ఒంటరిగానే ఇంటివద్ద ఉంటూ గంజాయితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సోదరుడి తీరుతో విసుగుచెందిన శ్యాంసుందర్ రెడ్డి ఇల్లు, గ్రామం వదిలి వరంగల్ లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్ లు చేసే క్రమంలో మరో గ్యాంగ్ తో విబేధాలు ఏర్పడి హత్యకు దారి తీసిందని స్థానికులు భావిస్తున్నారు. హత్యపై మాట్లాడేందుకు సోదరుడు నిరాకరించారు.