2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (ఏపి, తెలంగాణ ప్రాంతం)లో దాదాపు 7,656 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు జీవో నెంబర్ 42, 43 ప్రాతిపదికన నియామకం అయ్యారు. అయితే నియామకం అయిన రెండేళ్ల తరువాత నుంచి అంటే, 2002 నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్లో పోరాడుతూ వచ్చారు.