కార్తీక మాసంలో ఇష్ట దైవమైన శివుడు, విష్ణువు తదితర దేవుళ్లుకు పూజలు చేయడం ఎంతో మంచింది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. అలాగే దీపం కింద భాగం బ్రహ్మగా, స్తంభం విష్ణువు ప్రతిరూపంగా, ప్రమిదను శివునిగా పురాణాల్లో చెబుతారు. నదులు, జలాశయాలు, చెరువులు, కాలవల్లో దీపాలు వదలడం వల్ల పాపాలు సమిసి పోతాయని భక్తులు నమ్మకం. కార్తీక మాసంలో రోజూ దీపాలు వదలడం ద్వారా శాంతి, సుఖం, సౌఖ్యం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.