గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్ ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనంలేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.