టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేపట్టారు.