రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఒక్కరోజే 75,963 మంది యాత్రికులు దర్శించుకున్నారు. అందులో 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే టీటీడీకి రూ.3.99 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.