India vs West Indies Fines: టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ఉత్కంఠ భరితంగా జరిగింది. గురువారం ట్రినిడాడ్లో జరిగిన ఈ మ్యాచ్లో చివరికి ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. ఐదు టీ20 సిరీస్లో 1-0తో ముందడుగు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు 4 పరుగులతో ఓడిపోయింది. అయితే, తొలి టీ20 తర్వాత టీమిండియా, వెస్టిండీస్ జట్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది.