విశ్రాంత ఉద్యోగుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్ను ఇంటి వద్దకే పంపిస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో తప్పనిసరిగా డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలి. అయితే.. గతంలో దీని కోసం విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు చుట్టూ తిరిగేవారు.