పోక్సో కేసు నమోదు
బాలిక తన మనోవేదనను చెబుతుంటే, ఆ ఉపాధ్యాయురాలు కూడా చలించిపోయింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది నెలల క్రితం నుంచి తన తండ్రి మద్యం మత్తులో తనపై అఘాయిత్యం చేస్తోన్నాడని, తరచూ ఆయన ఈ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలిక ఫిర్యాదు చేసిందని, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.