సైనిక్ స్కూల్స్.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఈ ప్రత్యేక పాఠశాలల ముఖ్య ఉద్దేశం.. విద్యార్థులను జాతీయ రక్షణ అకాడమీ, ఇతర సైనిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా సిద్ధం చేయడం. అలాగే వారిలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించడం ఈ పాఠశాలల ప్రత్యేకత. ఇలాంటి స్కూల్ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించారు కేంద్రమంత్రి బండి సంజయ్.