తెలంగాణలో 12 మంది ఐపీఎస్ లు బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి నియామకం-hyderabad news in telugu ts govt transfers 12 ips officers tarun joshi rachakonda cp ,తెలంగాణ న్యూస్

TS IPS Transfers : తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మల్టీజోన్‌-2 ఐజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి నియమితులయ్యారు. రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీగా జోయల్‌ డేవిస్‌ను బదిలీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌, టీఎస్‌ఆర్టీసీ ఎస్పీగా అపూర్వరావు, ట్రాన్స్‌కో డీసీపీగా గిరిధర్‌ నియమితులయ్యారు. జోగులాంబ డీఐజీగా ఎల్‌.ఎస్‌ చౌహాన్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధనా రష్మి నియమితులయ్యారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా ఆర్‌.గిరిధర్‌, పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా డి.మురళీధర్‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Source link