తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ).. 2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది పరీక్షలు రాశారు. వారు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.