మెదక్ జిల్లాకు 8 పతకాలు..
ఈ క్రీడలో మెదక్ జిల్లా పోలీసులు 8 పతకాలను సాధించారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఒక బంగారు పతకం, 2 రజతాలు, 5 కాంస్య పతకాలను గెలుచుకున్నారని చెప్పారు. కానిస్టేబుల్ రాజాశేఖర్ టేబుల్ టెన్నిస్ డబుల్స్లో బంగారు పథకం, సింగిల్స్లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్.. బ్యాట్మెంటన్ విభాగంలో రజత పతకం, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందారని చెప్పారు.