ఏపీలో పౌల్ట్రీ రైతుల విలవిల…
వైరస్ కారణంగా ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉంగుటూరు, కొల్లేరు ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫామ్లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇక్కడ దాదాపు కోటి 30 లక్షల కోళ్లను పెంచుతున్నారు. రెండు నెలల్లో దాదాపు 20 లక్షల కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్టు పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు.