త్వరలో జరగనున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది, థర్డ్ జెండర్లు ముగ్గురు ఉండగా ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు.