భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఇంగ్లండ్ బౌలర్లను కుమ్మేశాడు. ఐదో టీ20లో హిట్టింగ్ తాండవం చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఆటతో సెంచరీ మోత మెగించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో అభిషేక్ చెలరేగిపోయాడు. ఏకంగా 13 సిక్స్లు, 7 ఫోర్లతో కదంతొక్కాడు. సిక్స్ల వర్షం కురిపించాడు. రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్తో సిరీస్లో చివరిదైన ఐదో టీ20లో నేడు (ఫిబ్రవరి 2) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ ముందు కొండంత టార్గెట్ ఉంచింది. భారత బ్యాటింగ్ ఎలా సాగిందంటే..