ధార్మిక భవన్ లో వేద పాఠశాల ఏర్పాటుపై వివాదం, ఆందోళనకు దిగిన మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు-medaram sammakka saralamma priests protested over the establishment of a vedic school in dharmika bhavan ,తెలంగాణ న్యూస్

తమకు కేటాయించిన స్థలంలో ఎండోమెంట్ ఆఫీసుల నిర్వహణకు వాడుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదని, కానీ అందులో వేద పాఠశాల ఏర్పాటు చేస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ధార్మిక భవన్, స్థలం మేడారం ఆలయానికి దక్కకుండా భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ధార్మిక భవన్ వివాదంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో మహా ధర్నాకు దిగుతామని దాదాపు 15 రోజుల కిందటే మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు అల్టీమేటం జారీ చేశారు.

Source link