ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇండియాలోనే వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి పంత్ పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు. అతని కోలుకునే వేగం చూసి బీసీసీఐ కూడా ఇదే ఆలోచనలో ఉంది. దానికోసం చేయాల్సినవన్నీ చేయడానికి బోర్డు సిద్ధమవుతున్నట్లు ఈఎస్పీఎన్క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది.