సీపీ ఎదుట లొంగుబాటు..
దాదాపు దశాబ్ద కాలంపాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన వంజెం కేషా.. శుక్రవారం వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కుడా సహకరించక పోవడంతో కేషా లొంగిపోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. సరెండర్ అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు కేషా జనజీవన స్రవంతిలో కలిసిందని వివరించారు.