ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు, కేసులకు భయపడి బీజేపీకి దాసోహం- సీపీఐ నారాయణ-guntur cpi narayana criticizes cm jagan cm kcr supporting bjp pm modi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మోదీకి జగన్ దత్తపుత్రుడు

ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడుగా కొనసాగుతున్నారని నారాయణ అన్నారు. జగన్ పైకి వైసీపీ ముద్ర, లోపల బీజేపీ ముద్రతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ దేశంలో బీజేపీ పాలన పోవాలని సీపీఐ పోరాడుతోందని నారాయణ అన్నారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి ఉన్నారని, ఎన్నికల సమయానికి పవన్ బీజేపీతో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు అవుతున్నా… నేటికీ నిందితులను పట్టుకోలేదని ఆరోపించారు. పులివెందులలో చిన్న పిల్లాలడిన అడిగినా వివేకా హత్య చేసిందెవరో చెబుతారన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Source link