ప్రమోషన్ల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన గవర్నర్..-governors office seeks clarification on ap governments controversial orders

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల్ని హరించేలా ఉందని ఆరోపిస్తున్నారు. మార్చి 6వ తేదీన జారీ చేసిన ఆఫీసు ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి స్పందించిన రాజ్‌భవన్‌ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిఏడి పొలిటికల్‌ సెక్రటరీకి లేఖను పంపింది.

Source link