ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష, 80 శాతం మంది హాజరు!-tspsc group 4 exam completed 80 percent applicants attended

TSPSC Group 4 : టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8180 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కమిషన్ పేర్కొంది. పేపర్‌-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా, పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు సరైనా సమయానికి చేరుకోలేకపోవడంతో పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.

Source link