బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయి- భట్టి విక్రమార్క-nampally congress leader bhatti vikramarka demands bjp brs govt implement minimum pay scale for workers

Bhatti Vikramarka : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా వారి హక్కులను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్ లో ఆయన అసంఘటిత రంగాల కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, పలువురు నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్మికులు, ఉద్యోగుల హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source link