ఎమ్మెల్సీ ఎన్నికలు లేని రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు బీసీల నుంచి 55,100 మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలలో ఈబీసీ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ కులాలకు చెందిన 3,497 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. జనరిక్ దుకాణాల ఏర్పా టుకు 220 మంది బీ ఫార్మసీ పూర్తిచేసిన వారు ఈ పథకంలో దరఖాస్తు చేశారు.