భద్రాచలం స్వామి వారికి బీజేపీ సీఎం పట్టువస్త్రాలు, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికే- అమిత్ షా-khammam union home minister amit shah criticizes cm kcr brs congress ,తెలంగాణ న్యూస్

కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో

తెలంగాణలో కమలం వికసిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అన్నారు. కేసీఆర్‌, ఒవైసీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. శ్రీరామనవమికి భద్రాచలంలో పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ కారు ఇకపై భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలంలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.

Source link