2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, ధోనీ నాయకత్వంలో, టీమ్ ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్ను, 4 సంవత్సరాల ముందు 2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్(T20 World Cup)ను కైవసం చేసుకుంది. భారత్ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని సరిగ్గా 10 ఏళ్లు పూర్తయ్యాయి. చాలా సార్లు ఐసీసీ ట్రోఫీని గెలుపొందేందుకు చేరువగా వచ్చి వెనక్కు వచ్చింది భారత్. అంతకుముందు 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. అయితే ఆఖరి మ్యాచ్లో పాకిస్థాన్పై ఓడిపోయింది.