మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు!-woman gang raped and murdered by four men in east godavari district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పటి నుంచి న‌ర్స‌రీల్లో ప‌నుల‌కు హాజ‌ర‌వ్వ‌ని వారు ఎవ‌ర‌న్న దానిపై పోలీసులు ఆరా తీశారు. దేవ‌ర యేసు పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌డు తెలిపిన వివ‌రాల‌తో మిగ‌తా ముగ్గురినీ అరెస్టు చేశారు. న‌లుగురినీ గురువారం రిమాండ్‌కు త‌ర‌లించామ‌ని డీఎస్పీ భ‌వ్య కిశోర్ వెల్లడించారు. యేసు ప‌థ‌కం ప్ర‌కారం.. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే.. అప్ప‌టికే ఆమె మృతి చెందారా? కాలువ‌లో ప‌డేసిన త‌రువాత చ‌నిపోయారా? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుంద‌ని పోలీసులు వివరించారు. నిందితులు నిత్యం గంజాయి, మ‌ద్యం మ‌త్తులో ఉంటార‌ని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు.

Source link