ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడుని ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం బహిరంగ సభలో అయ్యన్న చేసిన ప్రసంగాలపై టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్లు పోలీసులు అయ్యన్నకు వివరించారు. ఆయన పోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు.