తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం పొగమంచు పెరుగుతోంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. భద్రాచలం, హకీంపేట, రామగుండం, ఖమ్మం, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డు అయ్యాయి.