బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం గత వారం పదిరోజులుగా ప్రకటనలు ఇస్తోంది. క్షేత్ర స్థాయిలో సబ్సిడీ ధరలకు విక్రయాలు పెద్దగా జరగడం లేదు. మార్కెటింగ్ శాఖ నుంచి అరకొరగా వచ్చే ఉత్పత్తులు రోజూ కొంతమందికి మాత్రం విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి చర్యలు చేపట్టారు.