లైట్ తీసుకున్న పోలీసులు
మధుసూదన్ కిడ్నాప్(Kidnap) విషయం తెలిసిన వెంటనే భయాందోళనకు గురైన ఆయన భార్య సుగుణ డయల్ 100కు కాల్ చేసింది. తన భర్తను కిడ్నాప్ చేశారని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంది. కానీ పోలీసులు(Police) సరిగా స్పందించలేదు. ఆ తరువాత ఏప్రిల్ 23న పరకాల ఏసీపీని కలిస్తే కిడ్నాప్ విషయం పక్కన పెట్టి, సమ్మయ్య తీసుకున్న రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని తమను ప్రశ్నించినట్లు బాధితులు వాపోయారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయి వరంగల్ సీపీ(Warangal CP) అంబర్ కిశోర్ ఝాను కలిశారు బాధితులు. విషయం సీపీ ఆఫీస్ దాకా వెళ్లడంతో పరకాల పోలీసులు(Parkal Police) మధుసూదన్ను కిడ్నాప్ చేసిన వారిపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఏప్రిల్28న ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసి, 30వ తేదీన కానుగంటి కరుణాకర్, మేకల దిలీప్, బొచ్చు రమేశ్, చెనుమల్ల సమ్మయ్య, చెనుమల్ల అనిల్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.28 లక్షలకు సంబంధించిన ప్రామిసరి నోట్, ఒక ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పరకాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.