ఏప్రిల్ 1వ తేదీ వరకు..
ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ లోపు ఎన్ని అక్రమాలు చూడాల్సి వస్తుందోననే చర్చ జరుగుతోంది. అక్రమాలకు చోటు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిద్ధమైన విద్యాశాఖకు.. రోజుకో ఘటన జరగడం తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలో భారీ స్థాయిలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది అధికారులు, ఇన్విజిలేటర్లు సస్పెండ్కు గురయ్యారు. అలాగే ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు.