ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో దారుణం జరిగింది. బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడలోని 59వ డివిజన్ లూనా సెంటర్కు చెందిన మహిళ.. తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిందట అతనితో విడిపోయింది. కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్దాస్ కలిసి ఉంటున్నారు.